Don't Miss!
- Sports KKR vs RR: కోహ్లీ, ధోనీలా ఆడి మ్యాచ్ గెలిపించాను: జోస్ బట్లర్
- News అందులో భారతి ప్రమేయం; ఒకే రాయి జగన్, వెల్లంపల్లి ఇద్దరికెలా తగిలింది: రఘురామ లాజిక్!!
- Automobiles తగ్గిన వాహనాల ఎగుమతులు.. అయినా టాప్లో మారుతి సుజుకి.. కారణాలివే.!!
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
బాలా దర్శకత్వంలో నెక్ట్స్ ఆ హీరోనే...
'నాడోడిగల్', 'పొరాలి', 'సుందరపాండియన్', 'కుట్టిపులి' ద్వారా కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శశికుమార్ త్వరలోనే భిన్నమైన పాత్రతో అదరగొట్టనున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ రామేశ్వరంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 'పరదేశి' మాదిరిగానే చిత్రీకరణ పూర్తయ్యాక సినిమా విశేషాలను వెల్లడించనున్నట్లు వినికిడి.
హీరోకి తెరపై తిరుగులేని గుర్తింపు ఇస్తాడని దర్శకుడు బాలాకు పేరు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. సూర్య, విక్రం.. వంటి వారికి అలా మంచి సినీ జీవితాన్ని ప్రసాదించాడీ విలక్షణ దర్శకుడు. ప్రతిఒక్కరిలో అసలైన నటుణ్ని వెలికితీసే సత్తా ఆయనలో ఉంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం శశికుమార్ను వరించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
'పరదేశి'తో మరో వాస్తవిక దృశ్యకావ్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలా. తర్వాత విక్రంతో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోని 'ఐ'లో విక్రం నటిస్తున్నాడు. ఇదికాకుండా మరో రెండు సినిమాలకు కూడా పచ్చజెండా ఊపాడు. శంకర్ సినిమా తర్వాత.. బాలా దర్శకత్వంలో విక్రం మళ్లీ నటించనున్నాడనే వార్తలు ఆమధ్య వినిపించాయి. ఇది కుదరకపోవడంతో ఈ అవకాశం శశికుమార్ను వరించింది.