Don't Miss!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
సమంత తో సమానంగా ఐటం గర్ల్ రెమ్యునేషన్
ముంబయి నేపథ్యంలో సాగే ఈ కథలోని ఓ ఐటం సాంగులో హిందీ నటి చిత్రాంగద నటిస్తోంది. 'నవ్వే నా స్పెషాలిటీ.. నేను సిల్క్స్మిత కమ్యూనిటీ..' అంటూ సాగే ఈ పాటను వివేకా రాశారు. ఇటీవలే ముంబయిలో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకోసం రూ.కోటితో సెట్ వేసిందట చిత్ర యూనిట్. ఈ ఒక్క పాట కోసం ఆమె రూ.కోటి పారితోషికం తీసుకున్నట్లు కూడా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
విద్యుత్ జమ్వాల్, మనోజ్బాజ్పాయ్, వివేక్, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్రాజా సంగీతం సమకూర్చుతున్నారు.
'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.
లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్ డ్రాగన్ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్ సంతోష్శివన్ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.
ఇక
తన
కొత్త
సినిమా
కోసం
కమల్హాసన్
నటించిన
చిత్రం
శీర్షికను
సూర్య
ఎంచుకున్నారు.
'బిరియాని'
తర్వాత
వెంకట్ప్రభుతో
తెరకెక్కించనున్న
చిత్రానికి
'కల్యాణరామన్'
అనే
పేరు
పెట్టారు.
ఈ
పేరుతో
అప్పట్లో
కమల్
హీరోగా
ఓ
చిత్రం
వచ్చింది.
పేరు
పెట్టే
ముందు
కమల్తోపాటు
ఆ
చిత్ర
దర్శకుడు
పంజు
అరుణాచలానికి
కూడా
విషయాన్ని
వివరించారట
వెంకట్ప్రభు.
చిత్రానికి
యువన్శంకర్
రాజా
బాణీలు
సమకూర్చనున్నారు.
ఇది
రీమేక్
కాదని...
పేరు
మాత్రమే
పాతదని,
కథ
కొత్తదేనని
వెంకట్ప్రభు
స్పష్టం
చేస్తున్నారు.