Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రూమర్సే... సినిమా లేదు...ఫ్యాన్స్ నిరుత్సాహం
'ఐ' షూటింగ్ లో బిజీగా ఉన్న శంకర్.. తదుపరి అజిత్ కోసం మంచి కథను సిద్ధం చేశారని,'రోబో' సీక్వెల్లో అజిత్ నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఆ విషయాలన్నింటినీ శంకర్ ఖండించారు.
ధనుష్ నటించిన 'వేలై ఇల్లా పట్టదారి' చిత్రాన్ని చూసిన శంకర్.. దానిపై తన అధికార ఫేస్బుక్ ఖాతాలో స్పందించారు. సినిమా చాలా బాగుందని, తనకెంతో నచ్చిందని ప్రస్తావించారు. ఈ తరుణంలో అజిత్ అభిమాని ఒకరు 'మా హీరో అజిత్తో సినిమా తీస్తున్నారట.. నిజమేనా?' అని ప్రశ్నించారు.
దీనిపై శంకర్ స్పందిస్తూ.. ప్రస్తుతం విక్రం హీరోగా నటిస్తున్న 'ఐ' చిత్రీకరణలో బిజీగా ఉన్నాను. ఆ సినిమా విడుదలయ్యేవరకు మరో ప్రాజెక్టు గురించి ఆలోచించ లేదు. అజిత్తో సినిమా అంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని చెప్పారు. ప్రస్తుతం 'ఐ' విడుదలయ్యాకే తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తానని తెలిపారు శంకర్.