twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాలుగు భాషల్లో మణిరత్నం కొత్త చిత్రం

    By Srikanya
    |

    Mahesh Babu Team up for Mani Ratnam's Film
    చెన్నై : అగ్ర దర్శకుడు మణిరత్నం తన కొత్త చిత్రానికి సంబంధించిన పనులు వేగవంతం చేశారట. అతి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. తమిళంలోనే కాదు.. ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. చివరగా కార్తీక్‌ నట వారసుడు గౌతమ్‌ కార్తీక్‌తో 'కడల్‌' చిత్రాన్ని చేసిన మణిరత్నం ప్రస్తుతం ఓ కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.

    తొలుత ఆయన నాగార్జున, మహేష్‌బాబులతో ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే మణి కొత్త చిత్రం తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మలయాళంలో ఏకకాలంలో రూపొందనుందని, ఆయా భాషల్లో ఆయా హీరోలే నటిస్తారని కూడా సమాచారం. దీంతో మిగతా భాషల్లో తారాగణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మణిరత్నం నుంచి కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

    మణిరత్నం దర్శకత్వంలో మహేష్ నటించాలన్న కోరిక నిజం కాబోతోంది. నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ సైతం కీలకమైన పాత్రను పోషించనుంది. ఈ మేరకు ఐశ్వర్యారాయ్ ని కలిసినట్లు,మణిరత్నం ఆఫీస్ వర్గాలు థృవీకరించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

    ఇక ఈ చిత్రంలో శృతిహాసన్ సెకండ్ హీరోయిన్ గా చేయనుంది. నాగార్జున,ఐశ్వర్యారాయ్ ఇప్పటికే సైన్ చేసారని తెలుస్తోంది. అయితే మహేష్,శృతి హాసన్ ఇంకా ఎగ్రిమెంట్ లోకి రాలేదు. మహేష్ బాబు కొన్ని సూచనలు చేసారని,ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నట్లు వినికిడి. 2014 ఆగస్టు నుంచి ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. మద్రాస్ టాకీస్, వైజయింతీ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

    ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. చర్చలు చేస్తున్నామని, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అన్నారు. నిజానికి, పొన్నియన్ సెల్వన్‌ను కథను తెరకెక్కించాలని మహేష్ బాబు, మణిరత్నం కలిసి అనుకున్నారు. కానీ ఎందువల్లనో అది ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.

    యుటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద కొరటలా శివ సినిమాలో నటించడానికి కూడా మహేష్ బాబు అంగీకరించాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మణిరత్నం సినిమా ప్రారంభమవుతుందా, దాంతో పాటు ఈ సినిమాను మహేష్ బాబు చేస్తాడా అనేది తెలియడం లేదు.

    English summary
    Akkineni Nagarjuna and Mahesh Babu will team up for a Tamil-Telugu bilingual with ace filmmaker Mani Ratnam, who is currently busy working on the script for the project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X