Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సూపర్ స్టార్ కి సైతం తప్పని తలనొప్పి
చెన్నై : సాధారణంగా సినీ పరిశ్రమలో దర్శకులకు, హీరోలకు సన్ స్ట్రోక్ ఉంటూంటుంది. వాళ్ల పిల్లలు ఎలా ఉన్నా హీరోలుగా చేసి తీరాలని పట్టుపట్టడంతో అప్పటిదాకా సంపాదించిన పరువు, డబ్బు పెట్టుబడిగా పెట్టి తమ పిల్లలను మేకప్ చేసి వదులుతూంటారు. అయితే వాళ్లు అంతే వేగంగా వెనక్కి తిరిగి వచ్చి తలనొప్పులుగా మారుతూంటాయి. అయితే కొందరు స్టార్స్ గా సూపర్ స్టార్స్ గా ఎదుగి తమలోని ప్రతిభను చూపుతూంటారు. ఇప్పుడు అలాంటి తలనొప్పే సూపర్ స్టార్ రజనీకాంత్ కి తప్పేటట్లు లేదంటున్నారు. ఆయనకు ఉన్న ఇద్దరు కూతుళ్లూ పోటీపడి మరీ ఆయనను డైరక్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
సూపర్స్టార్ రజనీకాంత్ వారసురాళ్లు చిత్ర రంగంలో దర్శకులుగా తమను తాము రుజువు చేసుకుంటున్నారు. '3' ద్వారా పెద్ద కుమార్తె ఐశ్వర్య పరిచయమయ్యారు. తన భర్త ధనుష్ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. మేకింగ్ పరంగా ఐశ్వర్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె తనకూ డేట్స్ ఇవ్వాలని తండ్రిని కోరినట్లు సమాచారం.
మరో ప్రక్క రెండో కుమార్తె సౌందర్య ఏకంగా తండ్రే హీరోగా రూపొందించిన 'కోచ్చడయాన్' భారత చిత్ర పరిశ్రమను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో పెద్ద కుమార్తె నాన్న కాల్షీట్ కోసం వేచిచూస్తున్నారు. ప్రస్తుతం ఆమె 'వై రాజా వై'కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గౌతంకార్తీక్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా తండ్రికి చూపించారట ఐశ్వర్య. అదే సమయంలో ఆయన కాల్షీట్ కోరినట్లు సమాచారం.
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం రజనీ 'లింగా'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది పూర్తయిన తర్వాత రజనీ తన పెద్ద కుమార్తె దర్శకత్వంలో నటించే అవకాశమున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 'లింగా' చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.