Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మొదటిదే రిలీజ్ లేదు..అయినా ఇంకోటి
చెన్నై : సుందర్.సి, విశాల్ కాంబినేషన్లో ఇప్పటికే తెరకెక్కిన చిత్రం విడుదలకు నోచుకోని నేపథ్యంలో తాజాగా మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. కొంతకాలం పాటు నటుడిగా కొనసాగిన సుందర్.సి మళ్లీ మెగాఫోన్ పట్టుకుని కొన్ని హిట్ చిత్రాలు రూపొందించారు. విశాల్ హీరోగా, వరలక్ష్మి, అంజలి ఆయనకు జంటగా 'మదగజరాజా'ను రూపొందించారు. చిత్రీకరణ పూర్తెనా.. అనివార్య కారణాలతో విడుదలకు నోచుకోలేదు.
ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో 'ఆంబళ' అనే చిత్రం రూపొందనుంది. విశాల్కు జంటగా హన్సిక ఆడిపాడనుండగా.. ప్రభు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. యువన్ శంకర్రాజా స్వరాలు సమకూర్చుతారు. విశాల్కే చెందిన విశాల్ ఫిలిం ఫ్యాక్టరి ఈ సినిమా నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
విశాల్ మాట్లాడుతూ '' నాన్న, అన్నయ్య స్థాపించిన నిర్మాణ సంస్థలు ఉన్నప్పటికీ నేను నిర్మాతగా మారానంటే కారణం అదే. ప్రతీ హీరోకీ ఓ మలుపు ఉంటుంది. ఆ మలుపు దర్శకుడితోనే వస్తుంది. ఈ కథ చెప్పినప్పుడు నా సినీ జీవితానికి మలుపునిచ్చే చిత్రమిదే అవుతుందనిపించింది. ''అన్నారు.
తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాను. నిర్మాతగా మారడంతో ఆ సినిమా ఆలస్యమైంది. శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న తెలుగు సినిమాని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నాము అన్నారు.