Don't Miss!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టెలివిజన్ చరిత్రలో మహేష్ బాబు మరో రికార్డ్
మహేష్ బాబు చిత్రం అతడు మా టీవీ లో రెగ్యులర్ గా వేస్తూంటారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తం ఇచ్చి రెన్యువల్ చేయించుకోవటం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇది తెలుగు టీవీ చరిత్రలో రికార్డు అంటున్నారు. ఎందుకంటే ఓ సినిమా రైట్స్ పీరియడ్ అయ్యిపోయిన తర్వాత అదే ఛానెల్ వారు దాన్ని రిపీట్ చెయ్యటానికి ఇష్టపడదు. కానీ 'అతడు' చిత్రం వేసేటప్పుడు వచ్చే యాడ్ రెవెన్యూ చూసి మా టీవి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు.
ఇక మాటీవికి తగ్గట్లే అతడు చిత్రం కూడా ఫ్యామిలీలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కుటుంబం అంతా కూర్చుని చూసేటట్లు కుటుంబ భావోద్వేగాలు,యాక్షన్,కామిడీ సినిమాను అన్నివర్గాలకు నచ్చే విధంగా ఉండటం ప్లస్ అయ్యింది. ఇక అతడు సినిమా రిలీజైనప్పుడు ఈ చిత్రం చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువైందని,అంతరేటుకు బిజినెస్ లేదని అప్పట్లో నిర్మాత మురళీ మోహన్ కంప్లైట్ చేసి ఇక సినిమాలు తీయనని ప్రకటించారు.
ఆయన అన్నట్లే ఆ తరవాత సినిమాలు కూడా తీయలేదు. అయితే ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంసమైంది. ఇక ప్రస్తుతం మహేష్ తన నేనొక్కడినే చిత్రం హడావిడిలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కూడా మంచి రేటుకే శాటిలైట్ రైట్స్ అమ్ముడయినట్లు చెప్తున్నారు.