హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాకు పవన్ క్షమాపణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ''ఉక్కు నరాలు... ఇనుప కండరాలు... వజ్ర సంకల్పం గల యువకులు పిడికెడు మంది లభిస్తే భారత భవిష్యత్‌ను మార్చివేస్తానన్న స్వామీ వివేకానందుడే యువతకు మార్గదర్శి'' అని యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆ మహోన్నతుడి ఆశయాల్ని పాటిస్తే దేశం శాంతియుతంగా ఉంటుందన్నారు. పవన్‌ వచ్చారన్న విషయం తెలుసుకున్న వాహనదారులు తమ వాహనాల్ని వదిలేసి ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ట్రాఫిక్‌ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. యథాస్థితికి తెచ్చేందుకు పోలీసులు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది.

పవన్‌ రావడానికి ముందు వివేకానంద విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున మీడియా, ప్రరాపా నేతలు చేరుకున్నారు. పార్టీ నేత ఫిరోజ్‌ తన వెంట కొందరు అంగరక్షకులతో వచ్చారు. కార్యకర్తల్ని, అభిమానుల్ని రోడ్డు పైకి తోస్తూ దురుసుగా వ్యవహరించారు. విలేకరులనూ దుర్భాషలాడారు. దీంతో మీడియా విగ్రహం వద్ద బైఠాయించింది. పవన్‌ వచ్చాక విషయం తెలిసి క్షమించాలని కోరారు. ''మీరు చేయని తప్పునకు సారీ చెప్పడం ఎందుకు? మీ చేత అలా చెప్పించుకోవాలన్నది మా ఉద్దేశం కాదు'' అని కొందరు మీడియా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ఫిరోజ్‌ చేత అందరికీ క్షమాపణలు చెప్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X