
హైదరాబాద్: అప్పుడప్పుడు పార్టీల ప్రాతిపదికన విమర్శించుకుంటున్న నందమూరి బాలకృష్ణ, ఆయన సోదరి దగ్గుబాటి పురందరేశ్వరి సోమవారం ఒకే వేదికపైకి చేరారు. పురందరేశ్వరి భర్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర నందమూరి వంశీయులూ వీరికి తోడయ్యారు.
బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తుండగా, పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో వారు ఒకే వేదిక మీదికి రావడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో సోమవారం రాత్రి 'వెంకటాద్రి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొనడానికే వీరందరూ వచ్చారు. తారకరత్న కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సముద్ర దర్శకత్వం వహించారు.
బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తుండగా, పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో వారు ఒకే వేదిక మీదికి రావడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో సోమవారం రాత్రి 'వెంకటాద్రి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొనడానికే వీరందరూ వచ్చారు. తారకరత్న కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సముద్ర దర్శకత్వం వహించారు.






















