
ఇస్లామాబాద్: జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేరని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల చీఫ్ రెహ్మాన్ మాలిక్ అన్నారు. నేరస్థులెవరికీ తాము రక్షణ గానీ, పునరావాసం గానీ కల్పించబోమని ఆయన అన్నారు. లాహోర్ లో బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Read: In English
&13;కాగా, పాకిస్తాన్ అధికార వర్గాలు అజర్ ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముక్తార్ ఒక ఇండియన్ న్యూస్ చానెల్ తో చెప్పారు. అజర్ తమ కస్టడీలో లేడని ఆ వెంటనే పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ అన్నారు. అజర్ కోసం పాకిస్తాన్ కూడా గాలిస్తోందని ఆయన చెప్పారు. ముంబై దాడుల కేసులో అజర్ ను, దావూద్ ను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.









