వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మూడు కుటుంబాలేనా? జయప్రకాష్

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం : లోకసత్తా పార్టీ తమ ప్రచారాన్ని విశాఖ పట్నం నుంచి ప్రారంభించింది. ఇవాళ నగరంలోని ఆర్‌కే బీచ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభతో పార్టీ ప్రచారానికి శంఖం పూరించింది. ఈ సభలో మూడు జిల్లాల పరిధిలోని తమ పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసింది. బ్రాంది పంచి ప్రజలను మత్తులో ముంచి నోటుతో ఓటు కొనుక్కునే నాయకులు ఎప్పటికీ ప్రజానేతలు కారని లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ విమర్శించారు. ఈ దేశాన్ని గెలిపిస్తారా?.. మూడు కుటుంబాలను గెలిపిస్తారా? అని జేపీ యువతను ప్రశ్నించారు. ఓటు వేసే టపుడు ఎవరికోసం ఉన్నాం.. ఎందుకోసం ఓటు వేస్తున్నాం అనే విషయాన్ని ఆలోచించుకోవాలని ఆయన యువతను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X