లలిత్ మోడీకి హైకోర్టు నోటీసు

శుక్రవారం, ఏప్రిల్ 24, 2009, 11:10 [IST]
Lalit Modi
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) చైర్మన్ లలిత్ మోడీకి పంజాబ్ హైకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లినందుకు హైకోర్టు ఆయనకు ఆ నోటీసు జారీ చేసింది. జైపూర్ పేలుడు బాధితులకు డబ్బులు చెల్లించనందుకు దాఖలైన కేసులో మంజూరైన బెయిల్ ను ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని హైకోర్టు లలిత్ మోడీని ప్రశ్నించింది.
  Read:  In English 
&13;నిరుడు మే 13వ తేదీన సంభవించిన బాంబు పేలుళ్ల బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఐపియల్ సీజన్ సందర్భంగా నిరుడు లలిత్ మోడీ ప్రకటించారు. అయితే ఈ నిధులు అందించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నాగరిక్ మోర్చా అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు లలిత్ మోడీపై కేసు నమోదు చేశారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST  
IPL, Feroz Shah Kotla, Delhi
Match starts at 08:00 pm IST