చిరు నాలుగో ఫ్రంట్ గందరగోళం
నాలుగో ఫ్రంట్ విషయాలన్నీ సమాజ్ వాదీ పార్టీ అమర్ సింగ్ చూసుకుంటున్నారని చిరంజీవి ఇంతకు ముందు చెప్పారు. ఇప్పటికిప్పుడైతే ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత మూలయం సింగ్ యాదవ్, లోక్ జనశక్తి నాయకుడు రాం విలాస్ పాశ్వాన్ కలిసి ఏర్పాటు చేసిన కూటమిని నాలుగో కూటమిగా పిలుస్తున్నారు. చిరంజీవి చెబుతున్న నాలుగో ఫ్రంట్ కూడా ఇదేనని అమర్ సింగ్ తో ఆయన దోస్తీని బట్టి అర్థమవుతోంది.
ఇక, చిరంజీవి నిర్వహిస్తున్న జిల్లా సమీక్షా సమావేశాలు కూడా గమ్మత్తుగా జరుగుతున్నాయి. సమీక్షా సమావేశాలకు వచ్చిన పార్టీ అభ్యర్థులంతా తాము విజయం సాధిస్తామని చెబుకుంటున్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా తాము గెలుస్తామని చెప్పుకుంటున్నారు. ఇటువంటి ప్రకటన వల్ల లాభం లేదనే విషయాన్ని చిరంజీవి గుర్తించడం లేదు. పార్టీ పెట్టడానికి ముందు ఇచ్చిన హైప్ నే జిల్లా సమీక్షా సమావేశాల ద్వారా ఫలితాల వెల్లడికి ముందు చిరంజీవి ఇస్తున్నట్లు కనిపిస్తోంది.