
న్యూఢిల్లీ: తనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగించిన నాసాను కొట్టివేయాలని బిజెపి నాయకుడు, ఫిలిభిత్ అభ్యర్థి వరుణ్ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. రాష్ట్ర సలహా బోర్టు తనపై నాసా ప్రయోగాన్ని ఎత్తేయాలని నిర్ణయించినందున తనపై నాసాను కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
Read: In English
ఆ మేరకు వరుణ్ గాంధీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ముందు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపడుతుంది. సలహా సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ తో పాటు ఈ పిషటిన్ పై కూడా విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది.


















