కాకినాడ: పాలకొల్లులో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఓడిపోయారనే వార్త విన్న ఆయన అభిమాని ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. నల్లా నారాయణ అనే 45 ఏళ్ల ఆ అభిమాని తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read: In English
నారాయణ పశ్చిమ గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందినవాడు. పురుగుల మందు తాగిన అతన్ని చికిత్స నిమిత్తం అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అయితే అతను సోమవారం ఉదయం మరణించాడు.




















