చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్లు అరవింద్‌ కు కోర్టు నోటీసు

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
చెన్నై: ప్రముఖ నిర్మాత, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అల్లు అరవింద్‌ కు మద్రాసు హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. హిందీలో నిర్మించిన 'గజిని' చిత్రం వసూళ్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తమిళ నిర్మాత సేలం చంద్రశేఖర్‌, సూర్య హీరోగా తమిళం, తెలుగు భాషల్లో 'గజిని' సినిమా నిర్మించారు. ఇదే కథానేపథ్యంతో అల్లు అరవింద్‌ గీతాఆర్ట్స్‌ పతాకంపై హిందీలో ఆమీర్‌ ఖాన్‌ హీరోగా 'గజిని' సినిమా రూపొందించారు.

ఆ సినిమా విడుదలకు ముందు చంద్రశేఖర్‌ హైకోర్టులో కేసు వేశారు. తన అనుమతి లేకుండా కథను అరవింద్‌ తస్కరించారని, ఆ కథా నేపథ్యంతో హిందీలో సినిమా రూపొందించారని, తనకు పరిహారం ఇవ్వనందున సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ ను విచారించిన కోర్టు రూ.56 కోట్లు డిపాజిట్‌ చేసి, చిత్రాన్ని విడుదల చేసుకోవాలని అరవింద్‌ కు సూచించింది.

ఆ మేరకు కోర్టులో డిపాజిట్‌ చేసిన అరవింద్‌ గజిని సినిమాను విడుదల చేశారు. తర్వాత కేసు తేలేవరకు డిపాజిట్‌ డబ్బును చంద్రశేఖర్‌ కు ఇవ్వరాదని అరవింద్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దేశ, విదేశాల్లో విడుదలైన హిందీ గజిని రూ.230 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో చంద్రశేఖర్‌ ఇటీవల హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

అరవింద్‌ బావ చిరంజీవి పార్టీ స్థాపించి, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేశారని, గజిని వసూళ్ల సొమ్మును ఎన్నికల కోసం ఖర్చుచేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. తన కేసు విచారణ తేలే వరకు ఆ డబ్బునంతా తిరిగి కోర్టులో డిపాజిట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపైనే అరవింద్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X