హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ: గనుల లీజుపై రభస

By Staff
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: గనుల లీజు వ్యవహారంపై మంగళవారం శాసనసభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. గనుల లీజు కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇచ్చిన సమాధానంతో తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. టెండర్లు పిలవకుండా రక్షణ స్టీల్స్ కంపెనీకి గనుల లీజ్ కేటాయింపును ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.

మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని ప్రతిపక్షాలు ఆందోళకు దిగడంతో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు జోక్యం చేసుకున్నారు. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేయవద్దని ఆయన అనడంతో సభ వేడెక్కింది. తెలుగుదేశం సభ్యులు మంత్రి వ్యాఖ్యకు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అర్థం పర్థం లేని ప్రశ్నలకు స్పీకర్ ఎలా అనుమతిస్తున్నారని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X