
పోర్ట్ బ్లెయిర్: భారత ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఉత్తర కొరియా కార్గో నౌక ఎంవీ సాన్ ను భారత తీర ప్రాంత రక్షక దళం (కోస్ట్ గార్డ్) పట్టుకుంది. అనుమతి లేకుండా అండమాన్ దీవుల తీరంలో ఆ నౌక లంగర్ వేసింది. దాన్ని గమనించిన తీర రక్షక దళం ప్రశ్నిస్తున్న సమయంలో సాన్ సిబ్బంది పారిపోయేందుకు ప్రయత్నించింది. నౌకను రక్షక దళం స్వాధీనం చేసుకుని పోర్ట్ బ్లెయిర్ కు తరలించారు.
Read: In English
ఆ కార్గో నౌకలో ఉత్తర కొరియా నుంచి మధ్య ప్రాచ్యానికి పంచదారను రవాణా చేస్తున్నారు. నౌకకు చెందిన 39 మంది కొరియా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కోస్ట్ గార్డ్ తో పాటు రక్షణ శాఖ సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.












