
న్యూఢిల్లీ: కార్గిల్ శవపేటికల కుంభకోణంలో తనపై ఆరోపణలు చేసినందుకు కాంగ్రెసు తనకు క్షమాపణ చెప్పాలని రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ డిమాండ్ చేశారు. 2002లోని కార్గిల్ శవపేటికల కుంభకోణం కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో ఫెర్నాండెజ్ పేరు లేదు. సిబిఐ నుంచి తనకు క్లీన్ చిట్ రావడంతో ఫెర్నాండెజ్ సోమవారం ఆ డిమాండ్ చేశారు.
తనకు సిబిఐ నుంచి క్లీన్ చిట్ అవసరం లేదని, శవపేటికల కొనుగోలు ఫైలు తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తన వద్దకే రాలేదని సిబిఐ నిర్ధారణ చేసుకుందని ఆయన అన్నారు. అమరవీరుల రక్తం తాగినట్లు తనపై కాంగ్రెసు ఆరోపణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తనపై కాంగ్రెసు తప్పు రాజకీయ దాడి చేసి బలగాలను నైతికంగా దెబ్బ తీసే పనికి పూనుకుందని ఆయన అన్నారు.
తనకు సిబిఐ నుంచి క్లీన్ చిట్ అవసరం లేదని, శవపేటికల కొనుగోలు ఫైలు తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తన వద్దకే రాలేదని సిబిఐ నిర్ధారణ చేసుకుందని ఆయన అన్నారు. అమరవీరుల రక్తం తాగినట్లు తనపై కాంగ్రెసు ఆరోపణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తనపై కాంగ్రెసు తప్పు రాజకీయ దాడి చేసి బలగాలను నైతికంగా దెబ్బ తీసే పనికి పూనుకుందని ఆయన అన్నారు.

























