తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిజిపికి హెలికాప్టరా? బాబు మండిపాటు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తిరుపతి: వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాకుండా ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడడంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చిత్తూరు అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. "హోంశాఖ (మాజీ) మంత్రి సబితా ఇంద్రారెడ్డినేమో బస్సులో ఎక్కిస్తారా? ట్రాఫిక్‌లో నిర్బంధిస్తారా? డీజీపీ యాదవ్‌ మాత్రం హెలికాప్టర్‌లో వెళతారా? ఏమి యంత్రాంగం ఇది! ఇదేనా మీ విధి నిర్వహణ?" అని చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కలెక్టర్‌పై, ఎస్పీపై విరుచుకుపడ్డారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు హాజరుకావడానికి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వందమందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, చిరంజీవి ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చారు. తర్వాత అధికారులు ఏర్పాటు చేసిన వాహనాల్లో ఇడుపులపాయకు బయలుదేరారు.

అయితే కడప దాటిన తరువాత రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో రెండు గంటలు నిరీక్షించి తిరుగుముఖం పట్టారు. రాత్రి 10.30కి తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

"ముఖ్యమంత్రి అంతిమ సంస్కారాలకు హాజరుకావాలని వందల మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు వస్తే కనీసం ఆయన భౌతికకాయం వద్దకు కూడా మమ్మల్ని తీసుకెళ్లలేక పోయారు. ఏం చేస్తున్నారు మీరు..!" అంటూ చంద్రబాబు నిలదీశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X