వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు అప్పగిస్తే నరికేస్తా: అనూష

By Staff
|
Google Oneindia TeluguNews

Anusha
రాజమండ్రి: తనపై దాడి చేసి తన తల్లిదండ్రులను హత్య చేసిన ప్రేమోన్మాది రాజేష్ ను తనకు అప్పగిస్తే నరికేస్తానని బాధితురాలు అనూష అన్నది. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనూష వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన రాజేష్ ను చంపేయాలని ఆమె ఆగ్రహంగా అన్నది. ప్రభుత్వంతో న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదని ఆమె అభిప్రాయపడింది.

నిందితుడిని ఉరి తీయాలని ఆమె అన్నది. లేకుంటే విద్యార్థులకు అప్పగిస్తే అతడి సంగతి వారే చూసుకుంటారని, అప్పుడే తనకు మనశ్శాంతి కలుగుతుందని అనూష అంటోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాజేష్ అనే ప్రేమోన్మాది అనూషపై దాడి చేసి ఆమె తల్లిదండ్రులను హత్య చేసిన సంఘటన రాజమండ్రిలో తీవ్ర సంచలనం సృష్టించింది. మహిళా సంఘాలు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి సంఘటనల్లో నిందితులకు సరైన శిక్షలు పడకపోవడం వల్లనే అవి పునరావృతమవుతున్నాయని మహిళా సంఘాల నాయకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X