
ఛాత్రా: జార్ఖండ్ లోని ఛాత్రా జిల్లా రాజ్ పూర్ లో మావోయిస్టులు మంగళవారం జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు. ఈ దాడిలో నక్సల్స్ అనుబంధ సంస్థ నాయకుడు కూడా హతమైనట్లు సమాచారం. మృతులను నక్సల్స్ అనుబంధ సంస్థ శస్త్ర పీపుల్స్ మోర్చా హెడ్ ఉమేష్ మాలి, లోక్ జనశక్తి స్థానిక నాయకుడు ఉమేష్ సింగ్ భోక్తా, రంజిత్ రజ్జక్ లుగా గుర్తించారు.
Read: In English
మంగళవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో మిడిల్ స్కూల్లో జరుగుతున్న ఓ సాంస్కృతి కార్యక్రమాన్ని చూస్తుండగా సాయుధ మావోయిస్టులు దాడి చేసి కాల్పులు జరిపినట్లు పోలీసు సూపరింటిండెంట్ దేవ్ బిహారీ శర్మ చెప్పారు. దాడిలో గాయపడినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. పోలీసు డ్రైవర్ కూడా ఈ దాడిలో గాయపడినట్లు ఆయన తెలిపారు.




















