
గిరిధ్ (జార్ఖండ్): జార్ఖండ్ లోని గిరిధ్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం తెల్లవారు జామున రెండు భవనాలను పేల్చివేశారు. మావోయిస్టులు అప్ గ్రేడెడ్ హరిధ్, అప్ గ్రేడెడ్ ధార్పాహరి పాఠశాల భవనాలను పేలుడు పదార్థాలతో పేల్చివేశారు. ఈ సంఘటనల్లో ప్రాణ నష్టమేమీ లేదు.
మావోయిస్టులు మందుపాతరలు పెట్టి ఉంటారనే అనుమానంతో ఆ ప్రాంతాలకు వెళ్లే విషయంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నక్సల్స్ అణచివేతకు భద్రతా బలగాలు పాఠశాలల్లో విడిది చేస్తున్నారు. దీంతో మావోయిస్టులు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని పేల్చివేస్తున్నారు.
మావోయిస్టులు మందుపాతరలు పెట్టి ఉంటారనే అనుమానంతో ఆ ప్రాంతాలకు వెళ్లే విషయంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నక్సల్స్ అణచివేతకు భద్రతా బలగాలు పాఠశాలల్లో విడిది చేస్తున్నారు. దీంతో మావోయిస్టులు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని పేల్చివేస్తున్నారు.





















