To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

పొత్తులపై హై కమాండ్ దే నిర్ణయం: దానం

Danam Nagendar
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్టానానిదేనని కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అభ్యర్థుల జాబితా రూపకల్పనకు మంగళవారం పొన్నాల లక్ష్మయ్య, ఆనం రామనారాయణ రెడ్డి, దానం నాగేందర్ సమావేశమయ్యారు. తాము డివిజన్ కు ముగ్గురేసి అభ్యర్థుల పేర్లను సూచిస్తూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు నివేదిక సమర్పిస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తుది జాబితాను పిసిసితో చర్చలు జరిపి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఖరారు చేస్తారని ఆయన చెప్పారు. మజ్లీస్ తో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు చిత్తయిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ టికెట్ల కోసం కోలాహలం మొదలైంది. కాంగ్రెసులోని రెండు వర్గాలు టికెట్ల పంపకంలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు.
నవంబర్ 3, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
1st ODI , Sheikh Zayed Stadium, Abu Dhabi
Match starts at 04:30 pm IST  

కరీంనగర్ లో దానంకు చేదు అనుభవం

కరీంనగర్: కరీంనగర్ లో శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. దానం నాగేందర్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మంత్రిని వారు ఘెరావ్ చేశారు. దాంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. డెంగ్యూ తదితర వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.....

మంత్రులతో జోరుగా జగన్ మంతనాలు

హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కూడా పలువురు మంత్రులు, నాయకులతో గురువారం కూడా మంతనాలు సాగించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, దానం నాగేందర్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విశ్వరూప్ జగన్ ను కలిసి మాట్లాడారు. పలువురు కాంగ్రెసు నాయకులు, శాసనసభ్యులు ఆయనతో భేటీ.....
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
Oneindia  Oneindia Login