To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

మధు కొడాకు ఇడి సమన్లు జారీ

Madhu Koda
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాకు, అతని అనుచరులకు విచారణ నిమిత్తం ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ సమన్లు జారీ చేసింది. హవాలా లావాదేవీలపై, ఇన్వెస్ట్ మెంట్లపై ఇడి వారిని ప్రశ్నించనుంది. అనారోగ్య కారణంతో చికిత్స పొందుతున్న మధు కొడాకు అస్పత్రిలోనే సమన్లు అందజేశారు. రక్తంపోటు, కడుపు నొప్పులతో ఆయన రాంచీలోని ఆస్పత్రిలో చేరారు.



అతని అనుచరులు ఏడుగురికి కూడా ఇడి నోటీసులు జారీ చేసింది.సోదాల్లో బయటపడిన పత్రాలను పరిశీలించడంలో ఆదాయం పన్ను శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంటు నిమగ్నమయ్యాయి. కొడా, అతని అనుచరులు దాదాపు 2 వేల కోట్ల రూపాయల మేరకు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారని తెలియజేసే పత్రాలు అవి. విదేశాల్లో కొడా, అతని అనుచరులు పెట్టిన పెట్టుబడులపై, చేసిన కొనుగోళ్లపై ఇడి దృష్టి పెట్టింది.
నవంబర్ 4, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
    Upcoming Matches
Ind Vs Sl Tue 14th Feb ODI
Nz Vs Zim - 2nd Twenty20 at Seddon Park Tue 14th Feb Int2020
Pak Vs Eng - 2nd ODI at Sheikh Zayed Stadium Wed 15th Feb ODI
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
Oneindia  Oneindia Login