
ఛండిఘఢ్: ప్రముఖ జర్నలిస్ట్ ప్రభాష్ జోషి గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం మరణించారు. 72 సంవత్సరాల జోషికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు వున్నారు. న యీ దునియా పత్రిక ద్వారా జర్నలిస్ట్ జీవితాన్ని ఆరంభించారు. ప్రముఖ హిందీ దినపత్రిక జనసత్తాకు 1983 సంవత్సరం వరకు జోషి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1995 తర్వాత పత్రికారంగం నుండి తప్పుకున్న తర్వాత నుండి ఇప్పటికి జనసత్తాకు గౌరవ సంపాదకుడిగా పనిచేశారు.
పత్రికారంగంలో గాంధేయ విలువలను కాపాడేందుకు జోషి ఎనలేని కృషి చేశారు. అంతేకాక హిందీ జర్నలిజంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ అహ్మదాబాద్, ఛంఢిఘర్, ఢిల్లీ విభాగాలకు రెసిడెంట్ ఎడిటర్గా పనిచేశారు. జోషి అకాల మృతికి హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియా, ముఖ్యమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు.
పత్రికారంగంలో గాంధేయ విలువలను కాపాడేందుకు జోషి ఎనలేని కృషి చేశారు. అంతేకాక హిందీ జర్నలిజంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ అహ్మదాబాద్, ఛంఢిఘర్, ఢిల్లీ విభాగాలకు రెసిడెంట్ ఎడిటర్గా పనిచేశారు. జోషి అకాల మృతికి హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియా, ముఖ్యమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు.







Oneindia Login




