
న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్దిష్టమైన చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. గుర్తింపు పొందిన రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీలను డిల్లీలో చర్చలకు అహ్వానించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలికింది. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జనవరి 5వ తేదీన చర్చలు జరుపుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చర్చలకు ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఏకాభిప్రాయ సాధనకు ఈ అఖిల పక్ష సమావేశంలో చర్యలు తీసుకుంటారు.
కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం, బిజెపి, మజ్లీస్ పార్టీలను కేంద్రం అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించింది. తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగినందుకు హోం శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణపై నిర్దిష్టమైన చర్యకు ఈ సమావేశం ఉపయోగపడగలదని భావిస్తున్నారు. కాగా, తాజా పరిణామంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు సమావేశమవుతోంది.
కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం, బిజెపి, మజ్లీస్ పార్టీలను కేంద్రం అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించింది. తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగినందుకు హోం శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణపై నిర్దిష్టమైన చర్యకు ఈ సమావేశం ఉపయోగపడగలదని భావిస్తున్నారు. కాగా, తాజా పరిణామంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు సమావేశమవుతోంది.






















