వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Annavaram Temple
అన్నవరం: సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి ఆదివారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుని, అమ్మవారిని వధూవరులను చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సోమవారం రాత్రి 9.30 గంటలకు స్వామివారి దివ్య కల్యాణం వైభవంగా జరగనుంది. ఉత్సవ సన్నాహాలు వారం క్రితమే ప్రారంభమైనా తుఫానుకారణంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో మూడు రోజులపాటు పనులు నిలిచిపోయాయి. శనివారం మధ్యాహ్నం వాతావరణం కొంత తెరిపినివ్వడంతో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇంకా చిరుజల్లులు కురుస్తుండడంతో ఏటా జరిగేవిధంగా రామాలయం వద్ద ఉన్న కల్యాణ వేదికపై ఆరుబయట స్వామివారి కల్యాణం జరుగుతుందా, లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది.

వాతావరణం అనుకూలించకపోతే ప్రస్తుతం నిత్య కల్యాణం నిర్వహిస్తున్న మండపంలోనే కల్యాణం నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే జరిగితే స్వామివారి కల్యాణం లోపల జరగడం 30 ఏళ్లలో ఇదే ప్రథమం అవుతుంది. సోమవారానికల్లా పరిస్థితి అనుకూలించి కల్యాణం ఆరుబయటే జరుతుతుందన్న అభిప్రాయాన్ని పండితులు, ఆలయ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా దివ్య కల్యాణోత్సవాల నేపథ్యంలో సత్యదేవుని నిత్య కల్యాణం ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉండదని పండితులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X