వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూర్పు గోదావరి జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

East Godavari Dist
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధానమైన సీతపల్లి వాగు ఆదివారం ఉగ్రరూపం దాల్చింది. ఈ వాగుపై నిర్మాణంలో ఉన్న ముసురుమిల్లి ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌కు ఎగువ భాగంలో తాత్కాలికంగా నిర్మించిన మట్టి కట్ట కొట్టుకుపో యింది. భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద రాజమండ్రి-భద్రాచలం రహదారి మునిగిపోయింది. గోకవరం మండలం సంజీవ్‌నగర్‌లోని ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి.

ముసురుమిల్లి ప్రాజెక్టు మూలంగా దేవీపట్నం ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయం గా నిర్మిస్తున్న రహదారి ఛిన్నాభిన్నమైంది. దీంతో రంపచోడ వరం నుంచి మారేడుమిల్లి, దేవీపట్నం మండలాలకు రవాణా స్తంభించింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజవొమ్మంగి మండలం జడ్డంగిలోని మడేరు వాగు దా టుతూ ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు గిరిజనులు గల్లంత య్యారు. దోనెలపాలెం గ్రామానికి చెందిన కుంజం రాజబాబు, వీరకోట ప్రసాద్, వీరబోయిన శివ, గద్దా శివ, చోడి వెంక టేశ్వర్లు, విశ్వనాథం తదితరులు మడేరు వాగు దాటి జడ్డంగి లో జరిగే వారాంతపు సంతకు బయలుదేరారు. వాగు దాటుతుండగా ప్రవాహ ఉధతికి కుంజం రాంబాబు(30), వీరకోట ప్రసాద్(30) గల్లంతయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X