వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తూర్పు గోదావరి జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు
ముసురుమిల్లి ప్రాజెక్టు మూలంగా దేవీపట్నం ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయం గా నిర్మిస్తున్న రహదారి ఛిన్నాభిన్నమైంది. దీంతో రంపచోడ వరం నుంచి మారేడుమిల్లి, దేవీపట్నం మండలాలకు రవాణా స్తంభించింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజవొమ్మంగి మండలం జడ్డంగిలోని మడేరు వాగు దా టుతూ ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు గిరిజనులు గల్లంత య్యారు. దోనెలపాలెం గ్రామానికి చెందిన కుంజం రాజబాబు, వీరకోట ప్రసాద్, వీరబోయిన శివ, గద్దా శివ, చోడి వెంక టేశ్వర్లు, విశ్వనాథం తదితరులు మడేరు వాగు దాటి జడ్డంగి లో జరిగే వారాంతపు సంతకు బయలుదేరారు. వాగు దాటుతుండగా ప్రవాహ ఉధతికి కుంజం రాంబాబు(30), వీరకోట ప్రసాద్(30) గల్లంతయ్యారు.
Comments
Story first published: Monday, June 21, 2010, 11:47 [IST]