చిత్తూరు జిల్లాలో రెండు లారీలు ఢీ, డ్రైవర్ సజీవ దహనం
బుధవారం ఇదే జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. నాయుడుపేట బైపాస్ రోడ్డు మార్గంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 13మంది గాయపడ్డా రు. వివరాల్లోకి వెళితే...బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్న చిత్తూరు-1 డిపో బస్సు తిరుపతి నుంచి కుప్పం వెళుతున్న కుప్పం డిపో బస్సును చంద్రగిరి మండలం దానామూర్తివారిపల్లె వద్ద ఢీ కొంది.
ఈ ప్రమాదంలో రెండు బస్సుల డ్రైవర్లతో సహా 13 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది చిరంజీవి, అన్నపూర్ణ ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. ఒకే అంబులెన్స్లో అందరికీ స్థలం లేకపోవడంతో తిరుపతి నుంచి వచ్చిన మరో అంబులెన్స్ సిబ్బంది విజయకుమార్, బాలాజీ మిగతా వారిని రుయాకు తీసుకువెళ్లారు.
Comments
Story first published: Thursday, July 8, 2010, 11:52 [IST]