హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ9 వార్తపై మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

TV 9
హైదరాబాద్: టీవీ9 వార్తపై మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ9 ప్రతినిధికి ఫోన్ చేసి వార్తపై తీవ్రంగా ప్రతిస్పందించాడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. మాజీ నక్సలైట్ సమ్మిరెడ్డి తమ్ముడంటూ వార్త ప్రసారం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అందుకని తాను ఫోన్ చేసి మాట్లాడుతున్నానని అతను చెప్పాడు. తనను బద్నాం చేయవద్దని సూచించాడు.

తాను పోలీసు స్టేషన్ కు వెళ్లలేదని అతను చెప్పాడు. ఆ మహేందర్ రెడ్డి ఎవరో తనకు తెలియదని, తన జీవితాన్ని నాశనం చేయవద్దని అతను అన్నాడు. ఎందరో మహేందర్ రెడ్డిలో ఉంటారు కదా, మీరే ఎందుకు ప్రతిస్పందించారని అడిగితే సమ్మిరెడ్డి సోదరుడని చెప్పారు కాబట్టి ఫోన్ చేశానని అతను జవాబిచ్చారు. హైదరాబాదులోని కూకట్ పల్లిలో పోలీసులు సోదాలు నిర్వహించిన ఇల్లు మీది కాదా అని అడిగితే అతను సరైన సమాధానం ఇవ్వలేదు. కాగా, మహేందర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X