దేవుళ్లకు సేవలు బంద్, ఆలయాల అర్చకుల ఆందోళన
కాగా ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసే వరకు తమ ఆందోళన ఉంటుందని పూజారులు అంటున్నారు. ప్రభుత్వాన్ని తామేమి కారణం లేకుండానే అడగటం లేదని వారంటున్నారు. దేవాలయాలలో భక్తులు ఇచ్చిన కానుకల ద్వారా ప్రభుత్వానికే మేము జీతాలు ఇస్తున్నామని వారు అంటున్నారు. భక్తులు తమ కోర్కెల కోసం దేవుడి దగ్గరకు వస్తారు. అయితే దేవుడి దగ్గరే ఉన్న మేము, ప్రభుత్వానికి జీతాలు ఇస్తున్న మేము ఎవరిని అడగాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అందరి జీతాలు పెంచుతున్న ప్రభుత్వం తాము ప్రభుత్వ ఉద్యోగులము అయినప్పటికీ మమ్మల్ని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Comments
Story first published: Thursday, October 28, 2010, 11:34 [IST]