ప్రియుడికోసం కన్న కొడుకుపైనే యాసిడ్ పోసి చంపిన కసాయి తల్లి
అయితే తాను తన కుమారుడిపై యాసిడ్ పోయలేదని, దీపావళి టపాకాయలు పేల్చుతుంటే ఆ మంటలు రేగి తనకు కాలాయని అంటూ అందరినీ బుకాయించే ప్రయత్నాలు చేస్తోంది. ఆసుపత్రిలో కూడా అదే కారణం చెప్పి బాలుడిని చేర్చింది. బంధువులు మాత్రం తల్లే యాసిడ్ పోసిందని ఆరోపిస్తున్నారు. తన అక్రమ సంబంధం బయట పడుతుందనే అనుమానంతో పాటు కొడుకును నిరంతరం తాను అక్రమ సంబంధం పెట్టుకున్న శ్రీనివాస రెడ్డిని తండ్రిగా పిలవాలని ఆమె పట్టుబట్టేదని స్థానికులు చెబుతున్నారు. కుమారుడు ఆరో తరగతి చదువుతున్నాడు. కాగా ప్రియుడు శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నాడు. తండ్రి నారాయణకు ఇంకా ఈ విషయం తెలియదని అంటున్నారు.
గతంలో గుంటూరు జిల్లాలో నర్తనపైన, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ కుమారుడిని కన్నతల్లులే దాడి చేసిన సంఘటన అనంతరం ఇది వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి అనే పదాన్ని కామంతో కళ్లుమూసుకుపోయిన తల్లులు మంట గలుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.