వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీపై వ్యాఖ్యలకు కె కేశవరావుపై అధిష్టానం సీరియస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshavarao
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు ధ్వజమెత్తడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ఎక్కవ రోజులు గడువు లేకపోవటం, అంతేకాకుండా కేంద్రం నియోగించిన కమిటీపై కేశవరావు వ్యాఖ్యలు చేయడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు చెందిన ఢిల్లీ స్థాయి నాయకుడు కేశవరావుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

నివేదిక వచ్చే వరకు పార్టీ వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించినట్టు తెలుస్తోంది. నిబద్దత వ్యక్తులపై దూకుడుగా మాట్లాడడం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల శ్రీకృష్ణ కమిటీపై కె కేశవరావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కమిటీపై కేశవరావు ఘాటుగానే స్పందించారు. కమిటీ తను వచ్చిన పని చేసుకొని పోకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, గవర్నర్ నరసింహన్ ను కలిసి వెళ్లడమేమిటని ప్రశ్నించారు. శాంతిభద్రతలపై మాకు కమిటీ సభ్యులు చెప్పాల్సిన పని లేదన్నారు. దేశభక్తిపై వారు మాకు చెప్పవలసిన పని లేదని ఘాటుగానే స్పందించారు. ఈ వ్యాఖ్యలపైనే అధిష్టానం సీరియస్ గానే స్పందించి కెకె కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X