హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢోకా మాటలు ఎక్కువైన రాజకీయాల్లోకి రావడమే సిగ్గుచేటు: కె కేశవరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: రాజకీయాల్లో ఢోకా మాటలు ఎక్కువయ్యాయని, దీనిని చూస్తుంటే రాజకీయాల్లోకి రావడమే సిగ్గుచేటుగా అనిపిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు ఆదివారం ఆవేదన చెందారు. రవీంధ్ర భారతీలో జరిగిన తెలంగాణ డైరీ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సిహెచ్ విద్యాసాగరరావు, తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ కోదండరాం వచ్చారు.

ఈ సందర్భంగా కెకె మాట్లాడారు. ఉద్యమిస్తున్న వారీపై ఏ ఒక్కరిపై కేసులు పెట్టాలన్నా ముందు నామీద పెట్టాలని ఆయన అన్నారు. తెలంగాణకోసం జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీలకతీతంగా అందరూ కలిసి పోరాడితేనే తెలంగాణ సాధిస్తామన్నారు. అందరు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. మనం ఎవరి భూమినో ఆశించడం లేదన్నారు. మన తెలంగాణను మనం కోరుకుంటున్నామన్నారు. మాకు తెలంగాణ ఇవ్వండి, ఇంకేమీ వద్దని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరినట్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X