బెజవాడ వివాదంతోనే సూరిని హత్య చేసిన భాను కిరణ్: చార్జిషీట్
కాగా ఎనిమిది నెలల క్రితం విజయవాడలోని అన్నపూర్ణ ప్యాకేజి ఇండస్ట్రీస్ను యజమాని పెద్ద కుమారుడు శ్యాంప్రసాద్ను బెదిరింపులకు గురి చేసి చిన్న కుమారుడు అయిన కృష్ణప్రసాద్కు రాయించి ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అన్నపూర్ణ విలువ సుమారు 2 కోట్ల నుండి మూడు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. అన్నపూర్ణ గొడవలో తన మధ్యవర్తిత్వాన్ని సూరి కూడా ఖండించారు. అయితే ఇప్పుడు సిసిఎస్ పోలీసులు చార్జీషీటులో అన్నపూర్ణ విభేదాలే హత్యకు కారణమయ్యాయని పేర్కొనడం విశేషం. అంతేకాదు ఈ అన్నపూర్ణ ప్యాకేజి గొడవలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడిపై కూడా ఆరోపణలు వచ్చాయి.
Comments
English summary
Vijayawada Annapurna industries differences caused to Maddelacheruvu Suri murders. CCS police prepare chargesheet like that.
Story first published: Wednesday, June 1, 2011, 11:50 [IST]