
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో పార్టీ అధిష్టానం ఈ నెలాఖరు వరకు నిర్ణయం తీసుకోకుంటే తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని, అధిష్టానానికి ఇదే చివరి అవకాశమని అప్పటికీ స్పందించకుంటే తాము దేనికైనా సిద్ధమని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె కేశవరావు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు బుధవారం ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భేటీ అయి తెలంగాణ కోసం భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఊరుకున్నామని ఇక తమ ఉద్యమం ప్రారంభిస్తామని కేశవరావు అన్నారు. తెలంగాణ కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధం అన్నారు.
ఈ నెల 5న తేదిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని ఆ తర్వాత 6న అందరం కలిసి ఢిల్లీకి వెళతామని చెప్పారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తెలంగాణకు కట్టుబడి ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ రక్షణ కోసం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందే అన్నారు. మాలో ఎలాంటి విభేదాలు లేవని మీడియానే దానిని కొండంత చేసి చూపిస్తుందన్నారు. జూన్ నెల చివర వరకు కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే మా నిర్ణయం ఎవరూ ఊహించని స్థితిలో ఉంటుందని అన్నారు. జూలైలో తెలంగాణ రాకుంటే దీక్షకు దిగేందుకు సిద్ధమని చెప్పారు. అప్పటికీ కేంద్రం స్పందించకుంటే రాజీనామాలు చేస్తామని అన్నారు.
ఈ నెల 5న తేదిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని ఆ తర్వాత 6న అందరం కలిసి ఢిల్లీకి వెళతామని చెప్పారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తెలంగాణకు కట్టుబడి ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ రక్షణ కోసం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందే అన్నారు. మాలో ఎలాంటి విభేదాలు లేవని మీడియానే దానిని కొండంత చేసి చూపిస్తుందన్నారు. జూన్ నెల చివర వరకు కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే మా నిర్ణయం ఎవరూ ఊహించని స్థితిలో ఉంటుందని అన్నారు. జూలైలో తెలంగాణ రాకుంటే దీక్షకు దిగేందుకు సిద్ధమని చెప్పారు. అప్పటికీ కేంద్రం స్పందించకుంటే రాజీనామాలు చేస్తామని అన్నారు.














