
పెషావర్: పాకిస్తాన్లోని పెషావర్లో ఆదివారం రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 34 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత పాకిస్తాన్లో జరిగిన అతి దారుణమైన పేలుళ్లు ఇవే. రాజకీయ నాయకులు, సైనికాధికురాలు నివాసం ఉండే పెషావర్ ప్రాంతంలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు.
ఈ రెండో సంఘటనే దారుణంగా జరిగింది. మోటార్ బైక్పై వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. మొదటి పేలుడు అంత శక్తివంతమైంది కాదు. ఇది ఎలా జరిగిందనేది తెలియడం లేదు. పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది కూడా తెలియడం లేదు. అయితే, పాకిస్తాన్ తాలిబాన్ ఈ చర్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతుల్లో జర్నలిస్టు ఉన్నట్లు ఆస్పత్రి వైద్యుడు మొహమ్మద్ ఫరూఖ్ చెప్పారు. సిఐఎ చీఫ్ పెనెట్టా పర్యటన నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు.
ఈ రెండో సంఘటనే దారుణంగా జరిగింది. మోటార్ బైక్పై వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. మొదటి పేలుడు అంత శక్తివంతమైంది కాదు. ఇది ఎలా జరిగిందనేది తెలియడం లేదు. పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది కూడా తెలియడం లేదు. అయితే, పాకిస్తాన్ తాలిబాన్ ఈ చర్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతుల్లో జర్నలిస్టు ఉన్నట్లు ఆస్పత్రి వైద్యుడు మొహమ్మద్ ఫరూఖ్ చెప్పారు. సిఐఎ చీఫ్ పెనెట్టా పర్యటన నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు.













