పాకిస్తాన్‌లోని పెషావర్‌లో రెండు పేలుళ్లు, 34 మంది మృతి

ఆదివారం, జూన్ 12, 2011, 11:33 [IST]
Pakistan Blasts
పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 34 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత పాకిస్తాన్‌లో జరిగిన అతి దారుణమైన పేలుళ్లు ఇవే. రాజకీయ నాయకులు, సైనికాధికురాలు నివాసం ఉండే పెషావర్‌ ప్రాంతంలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు.

ఈ రెండో సంఘటనే దారుణంగా జరిగింది. మోటార్ బైక్‌పై వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. మొదటి పేలుడు అంత శక్తివంతమైంది కాదు. ఇది ఎలా జరిగిందనేది తెలియడం లేదు. పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది కూడా తెలియడం లేదు. అయితే, పాకిస్తాన్ తాలిబాన్ ఈ చర్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతుల్లో జర్నలిస్టు ఉన్నట్లు ఆస్పత్రి వైద్యుడు మొహమ్మద్ ఫరూఖ్ చెప్పారు. సిఐఎ చీఫ్ పెనెట్టా పర్యటన నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు.
English summary
Two explosions went off minutes apart in the northwest Pakistani city of Peshawar on Sunday, killing 34 people and injuring nearly 100 in one of the deadliest attacks since the US raid that killed Osama bin Laden last month, officials said.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets