తెలంగాణ అంతటితో ఆగవద్దు: అరుంధతీ రాయ్
ప్రాజెక్టులు, అభివృద్ధి పేరిట దోపిడీని అడ్డుకునే వారిని వేటాడటం జరుగుతున్నదన్నారు. అయితే ఉద్యమాల చరిత్ర, తిరుగుబాటుకు వెనుకంజ వేయని చరిత్ర గల తెలంగాణలో అలా జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అందరి స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందని ఆమె ఆశించారు. సమావేశానికి రాలేక పోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేశారు. మానవ సమాజం తనను తాను ఎలా నిర్వహించుకోవాలో పరిపాలించుకోవాలో చర్చ జరుగుతున్న తరుణంలో మనం తీవ్రమైన పర్యావరణ ప్రమాదాన్ని సృష్టించుకుంటున్నామని అన్నారు. సముద్రాలలో పూర్తిగా చేపలు కనుమరుగయ్యాయని, ప్లాస్టిక్ పెరిగిందని అన్నారు. మన మేథాశక్తి గురించి ఎంత గర్వపడినప్పటికీ మనం ఎంతో ముర్ఖులమని అన్నారు.
ఉత్తర తెలంగాణ, జార్ఘండ్, ఒరిస్సా తదితర ప్రాంతాలలో జరిగే ఘర్షణ నాగరికత, స్వాభావాల మధ్య జరిగే యుద్ధంగా భావిస్తున్నట్లు చెప్పారు. యుద్ధాలకు కారణం రెండు రకాలు. భూమి మీద ఉన్న వాటన్నింటికీ తానే హక్కుదారుడని మానవుడు భావించడం ఒకటి కాగా, రెండోది మొదటి సమాజాన్నే కాకుండా దాని సంస్కృతిని, ఆలోచనను నిర్మిలించి భూ వినాశానికి దారితీసే పెట్టుబడిదారి వర్గ సమాజం అని లేఖలో పేర్కొన్నారు. మన దేశంలో రక్షణ బడ్జెట్ వైద్య, విద్యపై ఖర్చు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.