హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పుడు వార్తపై ఆంధ్రజ్యోతికి కోర్టు మొట్టికాయ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Andhrajyothy
హైదరాబాద్: ఓ ఆలయ ప్రతిష్ట దెబ్బతినేలా తప్పుడు కథనాలను ప్రచురించిన వ్యవహారంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం రూ.5 లక్షలు పరువు నష్టం చెల్లించాలని రంగారెడ్డి కోర్టు ఇటీవల ఆదేశించినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక వార్త ప్రచురించింది. ఆంధ్రజ్యోతి పత్రిక కూకట్‌పల్లి విలేకరి 2007వ సంవత్సరంలో కనకదుర్గ ఆలయం ప్రతిష్ట దెబ్బతినేలా తప్పుడు వార్తలు రాశారని ఆరోపిస్తూ దేవస్థానం అధ్యక్షుడు సోమయ్య 2008లో పరువు నష్టం దావా దాఖలు చేశారు.

సుదీర్ఘ విచారణ తర్వాత ఆలయ ప్రతిష్ట దెబ్బతినేలా ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించిందని కోర్టు నిర్ధారించింది. ఇందుకు పరిహారంగా రూ.5 లక్షలు చెల్లించాలని పత్రిక ఎండి, చీఫ్ ఎడిటర్లను ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చుల కింద మరో ఏడువేల రూపాయల పైన చెల్లించాలని, తప్పుడు వార్తలు రాసిన విలేకరిపై తగిన చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.

English summary
YSRC Party president YS Jaganmohan Reddy's Sakshi news paper wrote a news about Andhrajyothy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X