
హైదరాబాద్: పటిష్టమైన లోక్పాల్ బిల్లు కోసం చేపట్టిన మూడు రోజుల దీక్షను సామాజిక కార్యకర్త అన్నా హజారే గడువుకన్నా ముందే విరమించారు. జైల్ భరో కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దీక్షకు ప్రతిస్పందన తక్కువగా ఉండడం, ఆరోగ్యం సహకరించకుపోవడం వంటి కారణాల వల్ల ఆయన దీక్షను విరమించినట్లు చెబుతున్నారు. వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆయన పదే పదే హెచ్చరించారు. ముంబైలోని ఎంఎండిఎ మైదానంలో ప్రారంభించిన దీక్షను విరమించుకుంటున్నట్లు బుధవారం మధ్యాహ్నమే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పార్లమెంటులో ఈ రోజు జరిగింది విచారకరమని, దీంతో తాను దీక్షను విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, ఇప్పుడున్న మార్గం అదొక్కటేననని ఆయన అన్నారు. ఐదు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఆయన చెప్పారు. ద్రోహులకు ఓటు వేయవద్దని తాము ప్రజలకు చెప్తామని ఆయన అన్నారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉందని, ఈ రెండేళ్లు తాను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. హజారేకు వంద డిగ్రీల ఫారన్హీట్ ఉష్ణోగ్రత ఉంది. దీంతో దీక్ష విరమించాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు. దీక్ష విరమించకపోతే మూత్రపిండాలపై ప్రభావం పడుతుందని వారు చెప్పారు.
పార్లమెంటులో ఈ రోజు జరిగింది విచారకరమని, దీంతో తాను దీక్షను విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, ఇప్పుడున్న మార్గం అదొక్కటేననని ఆయన అన్నారు. ఐదు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఆయన చెప్పారు. ద్రోహులకు ఓటు వేయవద్దని తాము ప్రజలకు చెప్తామని ఆయన అన్నారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉందని, ఈ రెండేళ్లు తాను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. హజారేకు వంద డిగ్రీల ఫారన్హీట్ ఉష్ణోగ్రత ఉంది. దీంతో దీక్ష విరమించాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు. దీక్ష విరమించకపోతే మూత్రపిండాలపై ప్రభావం పడుతుందని వారు చెప్పారు.













