పాకిస్తాన్‌లో సంక్షోభం: గిలానీపై ఐఎస్ఐ గుర్రు

బుదవారం, జనవరి  11, 2012, 18:33 [IST]
Khaleed Naeem Lodhi and Yousaf Raza Gilani
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. మెమొగేట్ కుంభకోణంతో పాకిస్తాన్‌లో పరిస్థితి దారుణంగా మారిపోయింది. పాకిస్తాన్ సైన్యానికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ ఆర్మీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందనే ప్రదాని యూసుఫ్ రజా గిలానీ విమర్శలు సంక్షోభానికి దారి తీశాయి. గిలానీ ఆరోపణలపై పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇటీవలి చైనా పర్యటన సందర్భంగా గిలానీ సైన్యంపై ఆ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని ఆరోపణలు తీవ్రమైనవని, వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని సైన్యం అంటోంది. ఆర్మీ మద్దతు పొందుతున్న ఐఎస్ఐ కూడా గిలానీ ప్రకటనను తప్పు పడుతోంది. పాకిస్తాన్ జనరల్స్ వచ్చే 24 గంటల్లోో అత్యవసరంగా సమావేశం కానున్నారు. దీంతో పాకిస్తాన్‌లో మరో తిరుగుబాటు తప్పదా అనే పరిస్థితిని కల్పించాయి. దానికి ముందు ప్రధాని గిలానీ రక్షణ కార్యదర్శి ఖలీల్ నయీమ్ లోఢీకి ఉద్వాసన పలికారు. అదనపు కార్యదర్శి నర్గీస్ సేథీకి బాధ్యతలు అప్పగించారు.

అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై కూడా ఆర్మీ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. జర్దారీ అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆర్మీ మండిపడుతోంది. మాజీ అధ్యక్షుడు ముషార్రప్ పాకిస్తాన్‌కు చేరుకునే లోగానే పాకిస్తాన్‌లో పరిస్థితి మారిపోయే అవకాశం ఉంది.
English summary
The memogate scandal in Pakistan has taken a turn for the worse with the fight between the Pakistan Army and the government now out in the open.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets