
వాషింగ్టన్: అమెరికా శ్వేత సౌధంలోకి మంగంళవారం రాత్రి ఆగంతకులు స్మోక్ బాంబు విసిరారు. దీంతో శ్వేత సౌధాన్ని మూసివేసినట్లు సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ప్రకటించారు. శ్వేతసౌధం వెలుపల ఆక్కుపై డీసికి చెదిన వేయి నుంచి 1500 మంది నిరనస ప్రదర్శన చేస్తున్న సమయంలో కంచెపై నుంచి స్మోక్ బాంబు విసిరారనని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి జార్జ్ ఓగిల్వీ చెప్పారు. దానిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. చాలా మంది నిరసనకారులు వెల్లిపోయారని, ఏ విధమైన అరెస్టులు జరగలేదని స్పష్టం చేశారు.
స్మోక్ బాంబు పడిన సమయంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లి శ్వేతసౌధంలో లేరు. వారు డిన్నర్కు బయటకు వెళ్లారు. ఆ తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు. దర్యాప్తు సాగుతోందని ఆ ప్రతినిధి తెలిపారు.
స్మోక్ బాంబు పడిన సమయంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లి శ్వేతసౌధంలో లేరు. వారు డిన్నర్కు బయటకు వెళ్లారు. ఆ తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు. దర్యాప్తు సాగుతోందని ఆ ప్రతినిధి తెలిపారు.













