అభివృద్ధికే ఓట్లు పడవు, ప్రచారమే కావాలి: ముఖ్యమంత్రి

శుక్రవారం, జనవరి  27, 2012, 18:09 [IST]
kiran kumar reddy
హైదరాబాద్: కేవలం అభివృద్ధి చేసుకుంటూ పోతే ఓట్లు పడవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుని, ప్రజల్లోకి తీసుకుని వెళ్తేనే ఓట్లు పడుతాయని ఆయన అన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెసు కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ప్రసంగించారు. తాము వంద రూపాయల పని చేసి ఒక్క రూపాయి ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నామని, మిగతా వాళ్లు ఒక్క రూపాయ పనిచేసి వంద రూపాయల ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి విస్తృతంగా ప్రచారం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

వడ్డీలేని రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన మెదక్ జిల్లా కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కూడా ఆయన చెప్పారు.
English summary
CM Kiran kumar Reddy said that development alone will not gice votes, that should be compaigned.
User Comments
Srsr Velagala 27 Jan 2012 08:12 pm
తప్పు మంత్రి గారు తమది అస్సలు అభివృద్ధి ఏమి చేయకుండ చేస్తామని కోటి రెట్లు ప్రజల సమయం/ప్రభుత్వం సొమ్ము దండగ చేసే పాలన ఇంత వరకు ఏ ప్రభుత్వం చేయని మాయా పరిపాలన చూపెడుతున్నరు ప్రజలకి ..అదె అరచేతిలో స్వర్గం అంటరే అదె.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets