
న్యూఢిల్లీ: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విశాఖపట్నం సీతమ్మధారలోని ఈనాడు దినపత్రిక కార్యాలయం స్థలం విషయంలో రామోజీరావు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తప్పుడు వివరాలతో దావా వేశారని సుప్రీంకోర్టు రామోజీరావుపై మండిపడింది. దానికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించినట్లు వార్తలు వచ్చాయి.
సీతమ్మధారలో ఈనాడుకు 9 వేల 200 గజలాల స్థలమే ఉందని రామోజీ రావు గతంలో దావా వేశారని, అయితే స్తల యజమాని వర్మ పోలీసు కేసు పెట్టారని ఓ ప్రముఖ మీడియా రాసింది. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు రామోజీరావు తప్పుడు వివరాలతో పిటిషన్ వేశారని నిర్ధారించింది. తప్పుడు వివరాలను సవరించుకుంటానని రామోజీరావు సవరణ పిటిషన్ వేశారు. 11 వేల 200 చదరపు గజాల స్థలం ఉన్నట్లు తనకు ఇప్పుడే తెలిసిందని ఆయన కోర్టుకు వివరించారు దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది.
సీతమ్మధారలో ఈనాడుకు 9 వేల 200 గజలాల స్థలమే ఉందని రామోజీ రావు గతంలో దావా వేశారని, అయితే స్తల యజమాని వర్మ పోలీసు కేసు పెట్టారని ఓ ప్రముఖ మీడియా రాసింది. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు రామోజీరావు తప్పుడు వివరాలతో పిటిషన్ వేశారని నిర్ధారించింది. తప్పుడు వివరాలను సవరించుకుంటానని రామోజీరావు సవరణ పిటిషన్ వేశారు. 11 వేల 200 చదరపు గజాల స్థలం ఉన్నట్లు తనకు ఇప్పుడే తెలిసిందని ఆయన కోర్టుకు వివరించారు దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది.














