
హైదరాబాద్: 2002లో జరిగిన తప్పులకు ఆనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ గురువారం డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మార్ కేసుపై సిబిఐ ఛార్జీషీట్లో 2002లో జారీ అయిన ఓ జీవోకు సంబంధించి ఐఏఎస్లు విశ్వేశ్వర రావు, ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్లను చేర్చిందన్నారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీయని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది కాబట్టి ఆయన దానికి బాధ్యత వహించాలన్నాలు.
ఆయన హయాంలో తప్పు జరిగితే పాపం అధికారులది, మంచి జరిగితే ఆయనది, తెలుగుదేశం ప్రభుత్వానిదా? అని ప్రశ్నించారు. ఎమ్మార్ కేసులో బాబును మినహాయించి, 2004లో వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రధాన నిందితుల్లో చేర్చటం ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసిపోయాయనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. కొందరి గుప్పిట్లో ఉండిపోయిన సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
ఆయన హయాంలో తప్పు జరిగితే పాపం అధికారులది, మంచి జరిగితే ఆయనది, తెలుగుదేశం ప్రభుత్వానిదా? అని ప్రశ్నించారు. ఎమ్మార్ కేసులో బాబును మినహాయించి, 2004లో వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రధాన నిందితుల్లో చేర్చటం ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసిపోయాయనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. కొందరి గుప్పిట్లో ఉండిపోయిన సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.














