
హైదరాబాద్: ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా ఆయన చేయాల్సిన విమర్శలన్నీ చేశారు. తన సామాజిక వర్గానికి చెందిన మంత్రిని రక్షించుకోవడానికి బిసి అయిన ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేశారని ఆయన ఆరోపించారు. మోపిదేవి వెంకటరమణ పేరు ప్రస్తావిస్తూ మద్యం సిండికేట్ల కేసులో అరెస్టయిన నున్నా వెంకటరమణ చేసిన వాంగ్మూలానికి సంబంధించిన కేసు ఒక్కటి మాత్రమే కోర్టు దాకా ఎందుకు వెళ్లిందనేది కూడా ఆయన వేసిన ప్రశ్న. కిరణ్ కుమార్ రెడ్డి ఏ మంత్రిని రక్షించడానికి మోపిదేవిని ఇరికించారనేది ఉత్కంఠగా మారింది. తన సామాజిక వర్గానికి చెందిన మంత్రి పేరును ఎసిబి నివేదిక నుంచి తొలగించడానికి మోపిదేవి పేరును ఇరికించారని డిఎల్ రవీంద్రా రెడ్డి విమర్శించారు.
మోపిదేవి వెంకటరమణతో బుధవారం ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ మంత్రి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమం ఏర్పాట్లన్నీ నున్నా వెంకటరమణే చూశాడని ఓ వ్యక్తి మోపిదేవి వెంకటరమణతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. ఆ నాయకుడి పేరు కూడా ఆయన చెప్పారు. అయితే, దానికి తానెలా సమాధానం చెబుతానని మోపిదేవి అన్నారు. మీ కాంగ్రెసు పార్టీకి చెందిన మంత్రే కదా అని ఆ వ్యక్తి మోపిదేవితో అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెసు రాజకీయాలతో తనకు అంతగా పరిచయం లేదని, అందువల్ల తాను ఆ విషయం ఏమీ చెప్పలేనని మోపిదేవి అన్నారు. దీన్ని బట్టి డిఎల్ రవీంద్రా రెడ్డి ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఏ మంత్రిపై చేసిందో అర్థమైపోతుందనే అభిప్రాయం వినపడుతోంది. తాము మోపిదేవి వెంకటరమణకు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చామని ఎసిబి అరెస్టు చేసిన వెంకటరమణ తన వాంగ్మూలంలో చెప్పాడు. అదే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణకు చుట్టుకుంది.
మోపిదేవి వెంకటరమణతో బుధవారం ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ మంత్రి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమం ఏర్పాట్లన్నీ నున్నా వెంకటరమణే చూశాడని ఓ వ్యక్తి మోపిదేవి వెంకటరమణతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. ఆ నాయకుడి పేరు కూడా ఆయన చెప్పారు. అయితే, దానికి తానెలా సమాధానం చెబుతానని మోపిదేవి అన్నారు. మీ కాంగ్రెసు పార్టీకి చెందిన మంత్రే కదా అని ఆ వ్యక్తి మోపిదేవితో అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెసు రాజకీయాలతో తనకు అంతగా పరిచయం లేదని, అందువల్ల తాను ఆ విషయం ఏమీ చెప్పలేనని మోపిదేవి అన్నారు. దీన్ని బట్టి డిఎల్ రవీంద్రా రెడ్డి ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఏ మంత్రిపై చేసిందో అర్థమైపోతుందనే అభిప్రాయం వినపడుతోంది. తాము మోపిదేవి వెంకటరమణకు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చామని ఎసిబి అరెస్టు చేసిన వెంకటరమణ తన వాంగ్మూలంలో చెప్పాడు. అదే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణకు చుట్టుకుంది.













