
లండన్: హైదరాబాదుకు చెందిన ఓ తెలుగు విద్యార్థిపై లండన్లో దాడి జరిగింది. దుండగులు ప్రవీణ్ రెడ్డి అనే హైదరాబాదీపై దాడి చేసి గాయపరిచారు. తీవ్రమైన గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సమాచారాన్ని హైదరాబాదులోని కుటుంబ సభ్యులకు అందించారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
శుక్రవారంనాడు తన మిత్రులతో కలిసి ప్రవీణ్ రెడ్డి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేశారు. ప్రవీణ్ రెడ్డి కుటుంబం హైదరాబాదులోని ఎల్బీ నగర్లో నివాసం ఉంటోంది. తండ్రి సుధాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రవీణ్ రెడ్డి లండన్లో ఎంబిఎ చదువుతున్నాడు.
శుక్రవారంనాడు తన మిత్రులతో కలిసి ప్రవీణ్ రెడ్డి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేశారు. ప్రవీణ్ రెడ్డి కుటుంబం హైదరాబాదులోని ఎల్బీ నగర్లో నివాసం ఉంటోంది. తండ్రి సుధాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రవీణ్ రెడ్డి లండన్లో ఎంబిఎ చదువుతున్నాడు.














