జగన్ జైలు శిక్షపై తల్లి విజయమ్మకు రేవంత్‌రెడ్డి సూచన

ఆదివారం, ఫిబ్రవరి 12, 2012, 15:35 [IST]
Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు శిక్షపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు ఆదివారం సూచన చేశారు. జగన్‌కు శిక్ష తగ్గాలంటే విజయమ్మ తన తనయుడిని పోలీసులకు వెంటనే అప్పగించాలని సూచించారు. తల్లిగా జగన్ చేస్తున్న తప్పులను ఆమె సరిదిద్దాలన్నారు. లేదంటే జగన్‌ను ఎప్పుడూ జైళ్లో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని భూకేటాయింపుల పైన వేసిన సభా సంఘం విషయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ పైన ఆయన మండిపడ్డారు. స్పీకర్ తీరు చూస్తుంటే వైయస్, జగన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేందుకే సభా సంఘం వేసినట్లుగా ఉందన్నారు. జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే సభా సంఘం ఆలస్యమైందన్నారు.

భూకేటాయింపుల సంఘం వేసిన తీరు సరిగా లేదని అందుకే దాని నుండి వైదొలగాలని తమ పార్టీ నిర్ణయించుకుందని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా చెప్పారు. స్పీకర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ వైఖరికి నిరసనగా తాము బిఏసి సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. వైయస్ హయాంలోని భూకేటాయింపులపై వేసిన సభా సంఘం స్పీకర్ ఏకపక్షంగా వేశారన్నారు. తమను సంప్రదించకుండానే సభా సంఘం ఎలా వేస్తారన్నారు. సభలో ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతామన్నారు. సోమవారం సమావేశాలకు ఎన్టీఆర్ ఘాట్ నుండి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళతామని చెప్పారు.
English summary
TDP leader Revanth Reddy suggested Pulivendula MLA YS Vijayamma in YSR Congress Party chief YS Jaganmohan Reddy assets case. He said Vijayamma must surrender his son Jagan to police for sentence reduction.
User Comments
Vijaya Simha Reddy 13 Feb 2012 09:41 am
రేవంత్ రెడ్డి శిఖండి లాగా మాట్లాడుతుంటాడు. తెలంగాణా ప్రాంతానికి చెందిన వాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని అడ్డుపెట్టుకుని ఇన్ని రోజులు మాట్లాడాడు. ఇప్పుడు తన మద్యం,ఇసుక అక్రమ వ్యాపారాలని దాస్తు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటాడు. ని పెళ్లనికే తెలుసు నీ అక్రమ వ్యాపారాల గురించి కాబట్టి నీ పెళ్ళాం ఇప్పుడే పోలీసులకి నిన్ను అప్పగిస్తే శిక్ష తగ్గుంది నీ అక్రమాలు కూడా తగ్గుతాయ్.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets