తల పగులగొడ్తామని రత్నకిశోర్ అన్నారు: జూడాలు

సోమవారం, ఫిబ్రవరి 13, 2012, 14:46 [IST]
Jr Doctors Strike
హైదరాబాద్: ముఖ్య కార్యదర్శి రత్నకిశోర్‌పై సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు తీవ్ర ఆరోపణ చేశారు. విధులకు హాజరు కాకపోతే తలలు పగుగొడ్తామని రత్నకిశోర్ బెదిరిస్తున్నారని వారు చెప్పారు. అలాంటి అధికారులుంటే తాము చర్చల్లో పాల్గొనేది లేదని వారు సోమవారం స్పష్టం చేశారు. తమ సమ్మెపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, తాము స్టయిఫండ్ కోసం మాత్రమే సమ్మె చేస్తున్నట్లు ప్రచారం సాగిస్తోందని, చాలా సమస్యలున్నాయని వారన్నారు. మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వస్తే వైద్యుల సమస్యలు ఏమిటో అర్థమవుతుందని ఆయన అన్నారు. కాగా, సమ్మెను మరింత ఉధృతం చేయాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు.

జూనియర్ డాక్టర్ల సమ్మెపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమ్మె చట్టవిరుద్ధమంటూ రాజు అనే న్యాయవాది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. వైద్య విద్యాశాఖకు, వైద్య విద్యార్థులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసును రేపటికి వాయిదా వేసింది. జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలను కూడా బహిష్కరించడం వల్ల రోగులు మృత్యువాత పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, వైద్య సేవలు అందక మరణించినవారెవరూ లేరని ప్రభుత్వం వాదిస్తోంది.
English summary
Junior doctors said that principle secretary Ratna Kishore is treatening them.
User Comments
Siva Rama 13 Feb 2012 08:24 pm
జుడాల సమ్మె పరిష్కారంలో ప్రభుత్వ వైఖరి చాల మొండితనంగా, మూర్ఖంగా ఉంది. అవినీతి జడలు రాష్ట్ర నలుమూలల అల్లుకుని లంచాలతో సిగపట్లు పట్టుకునే ఈ తరుణంలో వారి వ్యధభరిత కోరికలకు ఆర్ధిక వెసులుబాటు చూసుకోవడం పెన్నివైస్ పౌండ్ ఫూలిష్. సేవభావన కలిగిన వృత్తిపరుల పట్ల ప్రభుత్వ పట్టుదల ప్రవ్రుత్తి అనైతికం. సామజిక న్యాయంతో ఘోషించే ప్రజారాజ్యం కూడా కాంగ్రెస్తో కుమ్మక్కై భవాని దీపం వెలుగులో భాద్యతారహితంగా ప్రవర్తిస్తోంది. జుడాల జడలు కత్తిరించాలనుకోవడం ప్రభుత్వం కొరివితో తలగోక్కోవడమే.
RamachandraRao 13 Feb 2012 07:30 pm
అవును, వైద్య సేవలందక మరణించిన వారెవరూ లేరు. పోయినవారు ఆయువు తీరిపోయి పోయారంతే.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets